గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి : సిఎస్ శాంతి కుమారి
హైదరాబాద్ అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబం ధిత ఉన్నంత అధికారులతో సమీక్షించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రా ఫ్,అలీ,తోపాటు.. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్ శాంతి కుమారి. టీజీపీఎస్సీ చైర్మన్ మహేం దర్ రెడ్డి,మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతుండడం తో.. పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితు ల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాల్ తో కూడు కుంటున్నదని, తెలిపారు. ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి , సూచించారు.