Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ ప్రారంభించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ ప్రారంభించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

శంకర్ పల్లి అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్, ఐస్ క్రీం పార్లర్ అండ్ డ్రైఫ్రూట్స్ పాయింట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మణికంఠ మిల్క్ పాయింట్ ప్రొపరేటర్ సామా మల్లారెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఘన స్వాగతం పలికి, బోకే శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తనకు తాను స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి లభించేలా చిన్న తరహా బిజినెస్ ను ప్రారంభించిన సామా మల్లారెడ్డి ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సామా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Related posts