కెటిఆర్ బామ్మర్ది.. జన్వాడ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ భారీగా పర్మిషన్లు లేని ఫారిన్ లిక్కర్
శంకర్ పల్లి అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):జన్వాడలోని ఓ ఫాహౌస్ పై నార్సింగ్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ ఓ టి పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న ఫామ్ హౌస్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దిగా గురించారు. భారీ శబ్దాలతో రాత్రి పార్టీ నడుస్తోందని వచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు రైడ్స్ చేశారు. పోలీసులకు అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు దొరికాయి. రేవ్ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు పాల్గొన్నారు. ఎక్సెజ్ శాఖ అనుమతి లేని 10.లీటర్ల ఫారిన్ లిక్కర్(7 బాటిళ్లు) పట్టుబడ్డింది. ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు పోలీసులు సైఫర్ డాగ్స్ తో గాలిస్తున్నారు. రాజ్ పాకాల ఫాం హౌస్ జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్స్ టెస్టులు చేశారు. పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి కొకెయిన్ తీసుకున్నట్లు తేలింది. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిపై ఎన్ డి పి డి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్ రేవ్ పార్టీలో దొరికిన ఫారిన్ లిక్కర్ బాటిళ్లను ఎస్ ఓ టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.