తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజాక్షేత్రం): తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచింది. అన్ని రకాల గురుకులాలు, పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి 7వ తరగతి వరకు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.1,330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1,540కి పెంచారు. ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి రూ.2,100కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,65,700 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారు.