Praja Kshetram
తెలంగాణ

రూ.7కోట్ల విలువ గల డ్రగ్స్ స్వాధీనం

రూ.7కోట్ల విలువ గల డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ నవంబర్ 01 (ప్రజాక్షేత్రం):రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ ఏ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను హైడ్రోపోనిక్ గంజాయిగా గుర్తించారు. డ్రగ్స్ కు సంబంధించి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరి లగేజ్ ని తనిఖీ చేసిన సమయంలో అనుమానం వచ్చిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. 13 కెల్లాగ్స్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్ గుర్తించారు. నిందితులపై 1985 ఎన్ డి పిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts