పట్నం నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్
-పరిగి సబ్ జైలుకు జైలుకు తరలింపు
-ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు
-నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్
కొడంగల్ నవంబర్ 13(ప్రజాక్షేత్రం): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచారు. కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడికి కుట్ర చేశారన్న అభియోగాలపై నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద అరెస్టు చేశారు. వికారాబాద్ డీటీసీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టుకు తరలించగా కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. కోర్టుకు తరలించే క్రమంలో నరేందర్ రెడ్డి అక్కడ ఉన్న మీడియాను చూసి తన అరెస్టు అక్రమమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కొడంగల్లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి పరువు తన పరువు నిలుపుకునే క్రమంలో లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించి కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే లగచర్ల కేసులో పోలీసులు 16 మంది రైతులను అరెస్టు చేయగా, వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారిని పరిగి సబ్ జైలుకు తరలించారు.
*ఐజీ సత్యనారాయణ ఏమన్నారంటే..?*
*కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి*
*దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం*
*నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసాం… రేపు కస్టడీపై కోర్టులో వాదనలు జరుగుతాయి.*
*ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు.*
*పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి చేశారు.*