Praja Kshetram
తెలంగాణ

మూడు నెలలు ఇక్కడే ఉండటానికి సిద్దం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మూడు నెలలు ఇక్కడే ఉండటానికి సిద్దం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 

హైదరాబాద్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):పేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే.. మూసీ ప్రక్షాళనకు తానే సహకరిస్తానని కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట తులసీరామ్ నగర్ లో రాత్రి బస చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు. సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, బీజేపీ అధిష్టానం మాటే ఫైనల్ అవుతుందని చెప్పారు. అంతేగాక మా కార్యకర్తల్లో ఎవరికి పదవి వచ్చినా తనకు సంతోషమేనని అన్నారు. ఇక పేదల ఇళ్లను కూల్చబోమని రేవంత్ రెడ్డి హామీ ఇస్తే.. మూసీ ప్రక్షాళనకు తాను సహకరిస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి ఆయన విసిరిన ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నారా చెప్పాలని, పేదల ఇళ్లు కూలగొట్టకుండా మూసీ ప్రక్షాళన చేస్తానంటే తాను 3 నెలలు అయినా మూసీ వెంట ఉండటానికి సిద్దమేనని చెప్పారు. అంతేగాక నా ఛాలెంజ్ ను స్వీకరిస్తే.. మూడు నెలలు మూసీ ప్రాంతంలోనే కాపురం పెడతానని కేంద్రమంత్రి సవాల్ విసిరారు.

Related posts