Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లి కౌన్సిలర పార్శీ రాధ బాలకృష్ణ దంపతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి

శంకర్ పల్లి కౌన్సిలర పార్శీ రాధ బాలకృష్ణ దంపతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి

-పెళ్లి ఇంట్లో భారీ చోరీ నేపథ్యంలో ఢిల్లీ నుండి నేరుగా శంకర్ పల్లి వచ్చిన మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

-డీసీపీ శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడిన సబితా రెడ్డి

శంకర్ పల్లి నవంబర్ 19 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధ బాలకృష్ణ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగిన నేపథ్యంలో మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంగళవారం నాడు వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో కూతురి పెళ్లి సందర్బంగా మెహందీ ఫంక్షన్ అనంతరం బంగారం పెట్టడానికి వెళ్లగా అందులో ఉన్న సుమారు రెండు కిలోల బంగారం, 80 తులాలు వెండి ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని రాధ బాలక్రిష్ణలు సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.

Related posts