తహశీల్దార్ కు ముడుపులు ఇస్తే పని జరిగినట్లే
-అసైన్డ్ భూమి కి ఎకరం కు లక్ష ఇస్తే పేరు మార్పిడి
నందిపేట్ నవంబర్ 25(ప్రజాక్షేత్రం):ధరణి తో ఆ కార్యాలయంలో కాసులు కురిపుస్తున్నాయి, తహశీల్దార్ కి ఎకరం కు లక్ష ఇస్తే చాలు పట్ట లో పేరు మార్పిడి జరిగినట్టే! మండల కేంద్రంలో కొందరి మధ్యవర్తుల ద్వారా మాత్రమే పేరు మార్పిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కొన్ని ఎకరాల అసైండ్ భూమిని ఎకరం కు లక్ష రూపాయలు తీసుకొని మార్పిడి చేస్తున్నట్లు బాహాటంగా అనుకుంటున్నారు. ఎవరు ఎన్ని చేసిన ఎన్ని పిర్యాదులు చేసిన తనను ఏమి చేయలేరు అని రాజకీయ అండదండలు ఉన్నాయి. ఆని సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు వినికిడి, మండల కేంద్రంలో ఇటీవల కోట్ల రూపాయల విలువైన భూమి పై కూడా చర్యలు తీసుకోకుండా ఉండడానికి లక్షల రూపాయల ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఇలా కొన్ని నెలలుగా ఒకే దగ్గర విధులు నిర్వహిస్తూ భూ వివాదాలు ఉన్న భూములను ఎవరు ఎక్కువగా ముడుపులు ఇస్తే వారికి చెందేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది పైసలు చేతిలో పడందే పనులు కావని,రోజు రోజుకి ప్రజలను పీడించే అధికారులు ఎక్కువవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు పైరవీకారులు లేనిదే కార్యాలయంలో పనులు జరగవని కచ్చితంగా దళారితో వెళితే మాత్రమే పనులు జరుగుతాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.ధరణి వచ్చిన తర్వాత దళారులు ఎక్కువయ్యారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏ పని కావాలన్నా పైరవీకారులు చెప్పాలి. తహశీల్దార్ కు ముడుపులు అందజేస్తే ఏ పని అయినా సాధ్యం అనే సలహాలు పనులు జరుగుతున్నాయి. రెవెన్యూ కార్యాలయంలో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని ఉన్నతాధికారులు చెబుతున్నా మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పని తీరు మాత్రం మారటం లేదు ఫలానా ధ్రువ పత్రాలను పలానా గడువు లోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిది. కానీ అధికారులు మాత్రం డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారు. ఆన్లైన్ లో అర్జీ చేసుకున్న తర్వాత ధ్రువ పత్రాల కోసం నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయడమే జరుగుతుంది. రైతులు భూమి గురించి అర్జీ చెసుకున్నాక రిజిస్ట్రేషన్ చేయవలసింది పోయి వివిధ రకాల కారణలు చెబుతూ పట్టాలు చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వలన కొంతమంది వ్యవసాయ భూములను ప్రభుత్వ భూమి లాగా నమోదు చేశారు. రైతులు తహశీల్దార్ కి ఆ భూముల ను ఆన్లైన్లో మార్పిడి చేయాలని అర్జీ పెట్టుకున్న మూడు నాలుగు నెలలు అయినా చేయడం లేదు డబ్బులు ఇస్తేనే రైతుల పేరు మీద మార్పిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇచ్చిన అర్జీదారుని సమస్యను పరిష్కరిస్తున్నారు.