సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించిన సీఎం రేవంత్
హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): భారత దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేమనరేందర్రెడ్డి ఉన్నారు.