Praja Kshetram
తెలంగాణ

రాష్ట్రాభివృద్ధికి వెన్నుముక సింగరేణి -డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

రాష్ట్రాభివృద్ధికి వెన్నుముక సింగరేణి

 

-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

మందమర్రి డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):బొగ్గు ఉత్ప‌త్తిని సాధిస్తూ రాష్ట్ర‌, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగ‌రేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రానికే తలమానికంగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి కాలరీస్ కంపెనీ వెన్నెముకగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం కార్మికులకు అధికారులకు వారి కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాధారంగా ఉన్న సింగరేణిని కేవ‌లం బొగ్గు ఉత్పత్తికే ప‌రిమితం చేయ‌కుండా ఇతర రంగాలలోకి కూడా ప్రవేశించి మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి సంస్థ సుస్థిర భ‌విష్య‌త్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఆయన కోరారు.

Related posts