తెలుగు పత్రికా రంగంలో ‘ప్రజాక్షేత్రం’సంచలనం
– రాష్ట్ర ఐ&పిఆర్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ జనవరి 10(ప్రజాక్షేత్రం):తెలుగు పత్రికా రంగంలో ‘ప్రజాక్షేత్రం’ఒక సంచలనం అని తెలంగాణ రాష్ట్ర ఐ&పిఆర్ మరియు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ మినిష్టర్ క్వార్టర్స్ ప్రజాక్షేత్రం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ మీడియా వేగంతో, ప్రింట్ మీడియా విశ్వసనీయతతో ఎప్పటి వార్తలు అప్పుడే అందించడం ప్రజాక్షేత్రం ప్రత్యేకత అన్నారు. వార్తలను అత్యంత వేగంగా అందిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ‘ప్రజాక్షేత్రం’ డిజిటల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని ప్రశంసించారు.పాఠకులకు తాజా వార్తలు అందించాలనే లక్ష్యంతో ‘ప్రజాక్షేత్రం’పరిచయం డిజిటల్ ఎడిషన్స్ మీడియా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయని, ఇదే విధానాన్ని ఇతర సంస్థలు అనుసరించడం సక్సెస్ కు నిదర్శనంగా చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా ఉంటూ అనేక సమస్యలను కథనాల రూపంలో ప్రచురిస్తూ.. అధికారులు నాయకుల దృష్టికి తీసుకు వస్తున్న ప్రజాక్షేత్రం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు, పాఠకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాక్షేత్రం దినపత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కూమార్, నల్లన్న, రవీందర్, శేఖర్, గోపాల్ పాల్గొన్నారు.