అంబేద్కర్ వాదులు పెరగాల్సిన మాలల్లో అల్లరి మూకలు పెరుగుతున్నారు
-ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న వారిపై మాలలు చేస్తున్న అనాగరిక దాడులు మానుకోవాలి
-ఎస్సీ వర్గీకరణ కోసం నిలబడ్డ నాయకులను, మేధావులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
-ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ
హైదరాబాద్ జనవరి 17(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడి ధైర్యంగా గొంతువిప్పి మాట్లాడుతున్న మేధావుల మీద, ప్రజా నాయకులు మీద, కళానేతల మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్యపదజాలంతో దూషిస్తూ అనాగరిక దాడులు చేస్తున్న మాలలు తమ పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎం ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగతో కలిసి ఆయన మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది కాబట్టే లోకమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతుందని అన్నారు. వర్గీకరణ వ్యతిరేకిస్తూ సమాజంలో ఏకాకిగా నిలబడుతున్నది కేవలం మాలలు మాత్రమే అని అన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు గీత గీసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడ్డవాడే నిజమైన వీరుడిగా, మేధావిగా నిలబడుతారని ఇప్పుడు అలాంటి పాత్రనే డా. పృథ్వీరాజ్ యాదవ్, తెలంగాణ విఠల్, విమలక్క, డా.దరువు అంజన్న, సయ్యద్ ఇస్మాయిల్, నల్గొండ గద్దర్ , రేలారే గంగ, తీన్మార్ మల్లన్న వంటి నాయకులు, అలాగే ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, కె.శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్,వి. ప్రకాశ్ వంటి మేధావులు పోషిస్తున్నారని అన్నారు. వారి నిబద్ధతకు,వారి ధైర్యానికి మాదిగ జాతి అలాగే సమాజం జేజేలు పలుకుతుందని అన్నారు. వారిని కంటికి రెప్పలా మాదిగ జాతి కాపాడుకుంటుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేధావుల మీద బండబూతులతో దాడులు చేయడం మాలలు చేస్తున్న సిగ్గుమాలిన చర్య అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో బూతులు మాట్లాడుతూ,వారి కుటుంబ సభ్యులను దుషిస్తు , వారి వ్యక్తిత్వాలను కించపరుస్తూ అనాగరిక పద్ధతుల్లో దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. బుద్ధి, జ్ఞానం ఉంటే ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకించాలో చర్చ పెట్టి మేధావుల మద్దతును పొందాలి కానీ బూతులతో విషపు రాతలతో దాడులు చేసి వారిని నియత్రించాలని అనుకోవడం దిగజారుడుతనమే అవుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎందుకు అవసరం లేదో అందరిని పిలిచి సమావేశాలు పెట్టి చర్చ చేయండి. అంబేద్కర్ మార్గంలో ఆలోచించండి. మాల కులంలో అంబేద్కర్ వాదులు పెరగాల్సిన స్థానంలో అల్లరి మూకలు పెరుగుతున్నారు. దీనికి పూర్తి బాధ్యత మాల మేధావులు, మాల ఉద్యమ నాయకులే వహించాలి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకంగా మాల కులంలో విషం నింపడం వల్ల కొంతమంది ఉన్మాద ప్రవర్తనతో రగిలిపోతున్నారు. వాళ్ళను నియంత్రించాల్సిన బాధ్యత మాల నాయకులు మేధావుల మీదనే ఉన్నది. ఈ అనాగరిక చర్యల వల్ల సమాజం అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే మాలలు తమ తీరును మార్చుకోవాలని కోరుతున్నాం. తీరు మార్చుకోకపోతే మాదిగ జాతి అలాగే సమాజం చూస్తూ మౌనంగా ఉండే పరిస్థితి లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం.మంద కృష్ణ మాదిగ తన నాయకత్వం మాదిగ ప్రజలకు సామాజిక విలువలు నేర్పి నిర్మాణాత్మకంగా ముందుకు నడుపుతున్నది.. కానీ మాల నాయకులు తమ కులానికి విద్వేషాలు నూరిపోయడం, విషాన్ని చిమ్మడం , అనాగరికంగా ప్రవర్తించడం నేర్పారు.అందువల్లే ఈ రకమైన దాడులను తెగబడుతున్నారు. ఈ ముప్పై ఏళ్లలో మాలలు ఈ భూమి మీద ఏ ఒక్కరినైనా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఒప్పించగలిగారా? అని ప్రశ్నించారు.అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు అవలంభించే సంస్కృతి ఇది కాదని అన్నారు. ఈ విష సంస్కృతి నుండి మాలలు బయటపడాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా తెలంగాణ అధ్యక్షులు ఇనుముల అనీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రొట్టెల సునీల్ మాదిగ, ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు సామ్రాట్ అజయ్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దావు ఆదిత్య మాదిగ, బొల్లికొండ వేణు మాదిగ, నర్వ దాసు మాదిగ,మంద అనీల్ మాదిగ, వంశీ మాదిగ,ప్రదీప్ మాదిగ, సైదులు మాదిగ,హరి ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.