Praja Kshetram
తెలంగాణ

మందకృష్ణ మాదిగకు పద్మశీ అవార్డు

మందకృష్ణ మాదిగకు పద్మశీ అవార్డు

 

-మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది….

హైదరాబాద్ జనవరి 25(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అవార్డు వరించింది. ఏపీ, తెలంగాణలో ఆయన చేసిన సామాజిక సేవలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగతో పాటు పలువురు తెలుగువాళ్లకు సైతం పద్మ అవార్డులు దక్కాయి. దీంతో మందకృష్ణ మాదిగ అనుచరులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా వరంగల్ జిల్లా హంటర్ రోడ్డు శాయంపేటకు చెందిన మందకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ని ఏర్పాటు చేశారు. 1994లో ప్రకాశం జిల్లాలోని చిన్నగ్రామం ఈదుమూడి నుంచి 20 మంది యువకులతో ‘మాదిగ దండోరా’ అంటూ పోరాటం సాగించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘ కాలం ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇటీవల ప్రధాని మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది.

Related posts