ఎస్సీ వర్గీకరణకు ముస్లిం మైనార్టీల మద్దతు
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో వేల గొంతులు – లక్షల డప్పుల కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీ సమాజం తమ మద్దతు తెలిపింది. హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణకు ముస్లిం మైనారిటీల సంఘీభావ సదస్సు సయ్యద్ ఇస్మాయిల్ గారి ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా అంటరానితనం అనుభవించిన మాదిగలు ఇప్పుడూ చైతన్యం అవుతూ సమాజ ప్రగతిలో ముందుకు వస్తున్న తరుణంలో రాజ్యాంగ హక్కులు దక్కాలని చేస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ముస్లిం మైనార్టీ నేతలు స్పందించి ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగస్వాముల అవుతామని, వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి తరలివస్తామని తెలిపారు.