Praja Kshetram
తెలంగాణ

ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 06(ప్రజాక్షేత్రం):ముదిగొండ నుంచి వల్లభ వరకు 5 కిలోమీటర్లు (ముదిగొండ పట్టణ పరిధిలో) ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులతో రహదారి విస్తరణతో పాటు డ్రైనేజ్, ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు గాను 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆ పనులకు ముదిగొండ మండల కేంద్రంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి అజ్గర్ బుల్లెట్ బాబు కొమ్మినేని రమేష్ తహశీల్దార్ సునితా ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts