బేడీలు వేసి వెట్టిచాకిరి.
-నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్స్టేషన్లో ఓ యువకుడిపై పోలీసుల పైశాచికత్వం.
-కాళ్లకు సంకెళ్లు వేసి మరీ వెట్టిచాకిరి చేయించిన ఖాకీలు.
– సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు.
నిజామాబాద్ మార్చి 11(ప్రజాక్షేత్రం):బైక్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ యువకుడిపై ఖాకీలు పైశాచికత్వం ప్రదర్శించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పోలీస్ స్టేషన్లో కాళ్లకు బేడీలు వేసి బంధించి వెట్టిచాకిరి చేయించిన అమానుష ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ యువకుడి చేత తాను కూర్చున్న స్థలాన్ని ఓ పోలీసు ఉడిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
– కమిషనర్ సీరియస్
కాళ్లకు సంకెళ్లు వేసి పోలీస్స్టేషన్లో చీపురుతో ఊడిపించడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. దీనిపై జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య సీరియస్ అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది