ఎండుతున్న వరి పంట
– కన్నీరు మున్నీరవుతున్న రైతులు.
– కోట్ పల్లి ప్రాజెక్టు నీటిని వెంటనే విడుదల చేయాలి.
– అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టు యాదయ్య.
పెద్దేముల్ మార్చి 15(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని రేగోండి, కొండాపూర్ గ్రామాలలో వరి పంట నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. ఎండిన వరి పంటకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని శనివారం సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కొండాపూర్ మరియు రేగొండికి చెందిన రైతులు రబీలో వరి నాట్లు వేశారు. కొండపూర్ గ్రామంలోని చెరువు నీరు పై నా ఆధారపడి వరి నాట్లు నాటారు. కొన్ని రోజుల వరకు నీరు అంతంత మాత్రంగా అందినప్పటికీ, గత పది పదిహేను రోజుల నుంచి వరి పంటకి నీరు అందకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోవడంతో.. కోటిపల్లి ప్రాజెక్టు నుండి వెంటనే కొండాపూర్ చెరువులోకి నీటిని విడుదల చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్ మాట్లాడుతూ… కొండాపూర్ చెరువు కింద దాదాపు 200 ఎకరాలలో వరి సాగు చేశారు.ప్రస్తుతం చెరువులో నీళ్లు లేకపోవడంతో నీర వరి పంట పూర్తిగా ఎండిపోయింది. తక్షణమే కోటపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు . అంతేకాకుండా దాదాపు రెండు గ్రామాల్లో రైతులు ఈ వరి సాగు పైన ఆధారపడి జీవన కొనసాగిస్తూ ఉన్నారని ఇప్పుడు వరి పంటకు నీరు అందకపోవడంతో దాదాపు రెండు వందల ఎకరాల పంట మొత్తం ఎండిపోయి చేతికి అందకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాల రైతులందరూ ఈ పొలాలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని అధికారులు వెంటనే ఇట్టి సమస్యను పరిష్కరించవలసిందిగా స్థానిక జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కుగా సానుకూలంగా స్పందించి ,అధికారులతో మాట్లాడి రేపటి లోపు నీటినీ విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాగా సమస్య రేపటిలోగా పరిష్కారం కాకపోతే రెండు గ్రామాల రైతులతో కలిసి న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ,రైతులకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పీఓడబ్లు రాష్ట్ర కార్యదర్శి వై గీత , పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూర యాదయ్య , పిడిఎస్యు జిల్లా సభ్యులు జైపాల్, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.