లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ సీజ్.
– జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్.
– కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను సీజ్ చేసిన అధికారులు.
పెద్దపల్లి, మార్చి25(ప్రజాక్షేత్రం):లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేస్తున్నట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు.సోమవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి లైసెన్సు లేని కారణంగా సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తనిఖీలలో భార్గవి సర్వీస్ స్టేషన్ (యజమాని వి.రమేష్ ) ఫారం బీ లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు గమనించి సీజ్ చేశామని అన్నారు.పెట్రోల్ బంక్ లో 20 లక్షల 37 వేల 248 రూపాయల విలువ గల ఉన్న 9992 లీటర్ల పెట్రోల్,10,022 లీటర్ల డీజిల్ లను కూడా సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ తనిఖీలలో డిప్యూటీ తహసిల్దారులు సంతోష్ సింగ్ ఠాగూర్, రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.