8 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
-అందులో అద్భుతమైన భవనంతో పాటు సిమ్మింగ్ పూల్.
– 2003-2004 సంవత్సరంలో రికార్డు తారుమారు.
– మామిడి తోట ఏర్పాటు చేసి బిజినెస్ చేస్తున్న కబ్జాదారులు.
– రైతుల పేర్ల నుండి రియార్టర్ పేర్లకు మార్పు.
– గ్రామపంచాయతీ అనుమతి లేకుండానే భవన నిర్మాణం.
కొండాపూర్ ఏప్రిల్ 09(ప్రజాక్షేత్రం):ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూమి కబ్జాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అందరికీ తెలిసిన విషయమే. కాగా కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామ ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు శంకర్ పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే వున్నా దాదాపు సుమారు 7 కోట్లకు ఎకరం పలుకుతున్న భూమిని కబ్జా చేసారు. వివరాల్లోకెళ్తే మన్సాన్పల్లి గ్రామ రైతు మందుల పరమయ్య, ఆంజనేయులు పేర్ల పై నుండి హైదరాబాద్ కు చెందిన బడా రియాటర్లు విద్యాసాగర్, వరప్రసాద్ పేర్లపైకి సర్వే నెంబర్ 190/1,190/ఆ లో పూర్తి విస్తీర్ణం 2 ఎకరాలు 2003-2004లో తారుమారు కావడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు మామిడి తోట తాగు చేస్తూ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘటన పలుమార్లు వార్తాపత్రికల్లో ప్రచురించినా ఇంతకు ముందున్న రెవెన్యూ అధికారులు కేసు కోర్టులో ఉందని ఏదో ఒక మాట చెప్పి ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ భూమి (అసైన్మెంట్) భూమి అమ్మడం గాని కొనడం గాని జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
అసైన్మెంట్ భూములో మామిడి తోట ఏర్పాటు చేసి బిజినెస్
గ్రామపంచాయతీ పరిధిలో ఏదైనా నిర్మించాలంటే గ్రామపంచాయతీ అనుమతులు తప్పకుండా కావలసి ఉంటుంది. కాని దాదాపు 20 సంవత్సరాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా పామోస్ ఏర్పాటు చేసి అందులో కూలీలు ఉండడానికి ఏర్పాటు చేశామని మాయమాటలు చెప్పుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపట్టిన వారిపై గ్రామ పంచాయతీ సెక్రెటరీ తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అన్నారు.
నూతన పంచాయతీ కార్యదర్శి వివరణ
ప్రభుత్వ భూమి 190 సర్వే నెంబర్లో గల రెండు ఎకరాల పొలంలో ఉన్న భవనానికి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేము. మాకు దరఖాస్తు చేసుకోలేరు. వారి దగ్గర నుంచి ఎలాంటి టాక్స్ వసూలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ భూములు రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు అనుమతి లేకుండా విద్యుత్ మీటర్ బిగించడం ఉండదు. ఈ రూల్స్ అన్ని పక్కన పెట్టి యధావిధిగా వారికి ప్రభుత్వ భూములు కొంత మామూళ్లకు పాల్పడి వారికి మీటర్ బిగించారు.
2004లో గ్రామ పంచాయితీ కార్యదర్శి అనుమతి లేకుండా ఇల్లుకు మీటర్ ఎలా బిగించారు.
కావున సంబంధిత రెవెన్యూ, గ్రామపంచాయతీ, విద్యుత్ అధికారులుస్పందించి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమాలకు పాల్పడి భూమి కబ్జాకు పాల్పడ్డ వారిపై నాకు చర్యలు తీసుకొని గ్రామపంచాయతీచట్ట ప్రకారం అనుమతి లేని నిర్మాణాలు ఏర్పాటు చేసినందుకు వారిపై తమ చర్యలు తీసుకొని విద్యుత్ అధికారులు ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారుల గ్రామపంచాయతీ అధికారుల అనుమతి లేకుండానే విద్యుత్ మీటర్ బిగించిన వాళ్ళపై సంబంధిత అందరూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్ధానిక ప్రజాలు కొరడం జరిగింది.