Praja Kshetram
విద్యా సమాచారం

ఎస్సీ గురుకుల అడ్మిషన్లు ప్రారంభం

ఎస్సీ గురుకుల అడ్మిషన్లు ప్రారంభం

 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ప్రజాక్షేత్రం):తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. గురుకుల కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీతోపాటు పలు వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వివరాలకు గురుకుల అధికారిక వెబ్‌సైట్‌ www.tgswreis. telangana. gov.in ను సందర్శించాలని, దరఖాస్తులను మే 15వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు.

Related posts