Praja Kshetram
తెలంగాణ

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ..

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ..

 

– భూ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వైనం..

– విచారణ చేపడుతున్న అధికారులు..

మాక్లూర్, మే 21(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా లోని మాక్లూర్ మండల పరిధిలోని గోటుముక్కుల గ్రామ పంచాయ తీ సెక్రటరీ గంగా మో హన్ లంచం తీసుకుం టుండగా బుధవారం ఏసీబీకి చిక్కాడు. గ్రామంలోని ముప్పడి రాజేందర్ అనే వ్యక్తి భూ వ్యవహారంలోరూ. 18 వేలు లంచం తీసు కునే క్రమంలో ఏసీబీకి అడ్డంగా దొరికాడు. ప్రస్తుతం ఏసీబీ అధికా రుల విచారణ కొనసా గుతుంది. పూర్తి వివరా లను ఏసీబీ అధికా రులు మరికాసేపట్లో వెల్లడిం చనున్నారు.

Related posts