రౌడీ షీటర్ల తాట తీసిన పోలీసులు!
గుంటూరు, మే 26(ప్రజాక్షేత్రం):గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు రౌడీ షీటర్లకు పోలీస్ లు నడిరోడ్డుపై రాచ మర్యాదలు చేశారు. ఏకంగా నడి రోడ్డుపైనే లాఠీ జులిపించారు. ఇటీవల కాలంలో పట్టణం లో రౌడీ షీటర్ల ఆగడాలు అధికం కావడంతో పాటు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెనాలి పోలీసులు రౌడీ షీటర్లు విక్టర్, బాబూలాల్, రాకేష్లను పట్టుకొచ్చి ఐతనగర్ లోని నడిరోడ్డు పై కూర్చొబెట్టారు. ఓ పోలీస్ నిందితుల కాళ్లపై కాలు పెట్టి అదిమి పట్టు కోగా మరొకరు లాఠీతో నిందితుల పాదాలపై వాచిపోయోలా కోటింగ్ ఇచ్చి తాట తీశారు. పోలీస్ దెబ్బలకు తాళలేక నిందితులు కుయ్యో,మొర్రో, వామ్మో,అంటూ కేకలు, ఆర్తనాదాలు పెట్టారు. పోలీసుల చర్యను కొందరు సమర్థిస్తుండగా..మరికొందరు వారు చట్టాన్నిఅతి క్రమించి కొట్టారని..అలాంట ప్పుడు న్యాయస్థానాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.