Praja Kshetram
తెలంగాణ

రెండు గంటల పాటు రెండు పాములు సయ్యాటలు

రెండు గంటల పాటు రెండు పాములు సయ్యాటలు

 

 

రాజేంద్రనగర్, జూన్ 19(ప్రజాక్షేత్రం):పాములు అంటేనే అందరికీ భయమే పాము పేరు చెబితే చాలు అక్కడ ఉండేందుకు భయపడతారు. ఒకవేళ పాములు కనిపించి కళ్ల ముందు నాట్యం చేస్తే చూసేందుకు ఎంతో బాగుందనుకునే వాళ్లు కొందరైతే…మరికొందరు సర్పాలు సయ్యాట చేసే దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే భయపడతారు. అయితే రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం వట్టినాగులపల్లి గ్రామ పరిధిలో పాముల సయ్యాట అందరినీ ఆకట్టుకుంది. గురువారం గ్రామంలోని పంట పొలాలలోకి వెళ్లి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం సమయంలో సర్పాల సయ్యాటను ఆసక్తిగా గమనించిన జనం సెల్ ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు చుట్టూ ఎంతో మంది ఉన్నా అదేమీ పట్టనట్టు ఒకదాన్ని మరొకటి పెన వేసుకున్నాయి సర్పాలు. దాదాపు రెండు గంటల పాటు రెండు పాములు సయ్యాట చేస్తూనే ఉండిపోయాయి. దీంతో అలా చూస్తూ ఉండిపోవడమే స్థానికుల పనైంది. తాగునీటి కోసం వచ్చిన వాళ్లంతా రోడ్డుపైనే పాములు పెనవేసుకుని సయ్యాట చేస్తుండటంతో ముందుకు వెళ్లలేకపోయారు. అటు.. ఇటు.. రోడ్డుపై వెళ్లే గ్రామస్తులు కూడా సర్పాల సయ్యాటను సెల్‌ఫోన్‌లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ ఆసక్తిగా గమనించారు. దాదాపు 10 అడుగుల మేర ఉన్న రెండు సర్పాలను చూసి కొందరు భయంతో పరుగులు తీస్తే.. మరికొందరు మాత్రం సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

Related posts