Praja Kshetram
తెలంగాణ

ఎన్ని కథనాల్లో వచ్చిన హైతాబాద్ లో ఆగని అక్రమాలు

ఎన్ని కథనాల్లో వచ్చిన హైతాబాద్ లో ఆగని అక్రమాలు

 

– ఎన్ని పత్రిక కథనాల్లో వచ్చిన స్పందించని అధికారులు.

– మమ్ములు ముట్టినట్టు చుట్టుపక్క ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

– ఇన్ని అక్రమాలు జరుగుతున్న అధికారులు మౌనం?.

– నిబంధనలకు విరుద్ధంగా ఇంకొన్ని.

– అనుమతి రెండుకు.. నిర్మిస్తోంది ఐదు.

– అక్రమ నిర్మాణాలు అయినా కూల్చివేతలు లేవు.నోటీసులు కాసుల కోసమేనా?

– పత్తాలేని షాబాద్ మండల టౌన్ ప్లానింగ్ టీం.

షాబాద్, జులై 19(ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం హైతాబాద్ టౌన్ అక్రమం, అనధికారిక, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరందుకున్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వారు తప్ప మిగతా వారు మాత్రం అనుమతుల కోసం ముందుకు రావడం లేదు. గతంలో కూడా ఇటువంటి పత్రిక కథనాలు వచ్చిన చరణం లేని అధికారులు .నాలుగైదు నెలలుగా ఇలాంటివి పెరిగిపోతున్నాయని ఆయా ప్రాంతవాసుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు సహించబోమని అధికారులు చెబుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఓట్లు ఎక్కడ కోల్పోతామో అన్న ఉద్దేశంతో కూల్చివేతల జోలికి వెళ్లనివ్వడం లేదు.అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాల జోరు కనిపిస్తోంది. వీటికి తోడు పెంట్‌హౌజ్‌లు విరివిగా నిర్మించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. హైతాబాద్ కార్యదర్శి తెలిపిన వివరాల వరకు జి ప్లేస్ టూ కి మాత్రమే అనుమతులు ఇచ్చాము వాళ్ళు జి ప్లస్ ఫైవ్ ఎత్తుకు కట్టారు నోటీసులు జారీ చేశాము అని తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోవడంలేదని కార్యదర్శి తెలుపుతున్నారు.. దీనిపై షాబాద్ మండల టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల కనుసైగలోని ఇవన్నీ జరుగుతున్నాయా! నోటీసులు కాసుల కోసమేనా! అక్రమ నిర్మాణాలను అని తెలిసి కూడా చూసి కూడా చూడనట్టు ఉంటున్న అధికారులు అని ఆరోపణలు.

– నోటీసులు కాసుల కోసమేనా?

ఎన్ని నోటీసులు వచ్చినా పట్టించుకోని అక్రమ బిల్డింగ్ ఓనర్లు.నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేకుండా అక్రమంగా పెద్ద భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. నోటీసులు జారీ చేశామంటున్న కార్యదర్శి నోటీసులు కాసుల కోసమేనా?.. సామాన్యులు, మధ్యతరగతి వారు నిర్మిస్తున్న చిన్న చిన్న నిర్మాణాలపై షాబాద్ మండల టౌన్ ప్లాన్ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఈ సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ న్యాయ స్థానం ఆదేశాలు అమలులో ఉన్నా.. అక్రమ నిర్మాణాలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి.అడ్డుకోవాల్సిన సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఎసీపీ,టీపీఎస్, చైన్ మెన్ లు కలెక్షన్లపైనే దృష్టి సారించారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు కొంత మంది రాజకీయ నేతలు అండగా నిలుస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సిబ్బంది జంకుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

– ఎన్ని కథనాల్లో వచ్చిన పట్టించుకోని అధికారులు

హైతాబాద్ గ్రామంలో అక్రమ నిర్మాణాలపై ఏ యొక్క అధికారి కూడా స్పందించకపోవడం విడ్డూరం. నోటీసులు కాసుల కోసమేనా! అధికారులు మౌనంగా ఉండడానికి కారణమేంటి? అసలు హైతబాద్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు అడ్డు ఎవరు! ఎన్ని అక్రమాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు ఉంటే ఎంత ఊడితే ఎంత! కనీసం స్పందనైనా ఉండాలి కానీ ఎటువంటి కథనం లేదు చదవడం లేదు ఎందుకు? నోటీసులు ఎన్ని జారీ చేసిన కాసుల కోసమేనా అని ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

Related posts