కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి
ప్రజాక్షేత్రం వెబ్ డెస్క్:ఘనాలో బుధవారం సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో 8 ఎనిమిది మంది మరణించారు. అక్ర నుండి బయలుదేరిన కొన్ని గంటలకే హెలికాప్టర్ రాడార్ నుండి మిస్ అయింది. ఈ ప్రమాదంలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పాలక పార్టీ వైస్ చైర్మన్, ఒక ఉన్నత జాతీయ భద్రతా సలహాదారు, సిబ్బంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.
