రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం!
తెలంగాణ బ్యూరో ఆగస్టు 07(ప్రజాక్షేత్రం):విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రతిష్టంభన నెలకొంది. గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్, కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేనట్లేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఒకటి రెండు రోజుల్లో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
