సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ మీటింగ్లో తొక్కిసలాట.
– చిన్నారులతో సహా 31మంది మృతి!
నేషనల్ బ్యూరో సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారుసహాయక చర్యలు,వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు.
