Praja Kshetram
తెలంగాణ

ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం

ఖైరతాబాద్ మే 21 (ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం రూ.25,50,002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సి.రమేశ్‌ తెలిపారు. దీంతోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని వివరించారు.

Related posts