Praja Kshetram
తెలంగాణ

మహా నగరంలో వైద్య మాయగాళ్ళు

మహా నగరంలో వైద్య మాయగాళ్ళు

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత

రోగులకు యాంటి బయాటిక్స్ ఇస్తున్న ప్రబుద్ధులు

హైదరాబాద్ మే 24 (ప్రజాక్షేత్రం): హైదారాబాద్ లోని పలువు నకిలీ వైద్యులను అధికారులు గుర్తించారు.హైదరాబాద్ లోని శుక్రవారం తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నట్లు గుర్తించారు.తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ సన్నీ డేవిస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.

Related posts