రైలు ఢీకొని వ్యక్తి మృతి
వికారాబాద్ జూన్ 01 (ప్రజాక్షేత్రం): రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘ టన వికారాబాద్-సదాశివ పేట రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా నవపేట మండలం మమ్మదనపల్లి గ్రామ సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గ్రామస్తులు గమనించి రైల్వే పోలీసు లకు సమాచారం ఇచ్చారు..గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (30) రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్టు స్థానికులు భావిస్తున్నారు. శవాన్ని వికారాబాద్ ప్రభు త్వ ఆసుపత్రి కి తరలించి మార్చురిలో భద్రపరిచారు. ఈ మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.