Praja Kshetram
క్రైమ్ న్యూస్

బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి

బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి

 

మొయినాబాద్ జూన్ 05 (ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని మొయినాబాద్ మండల పరిధి బాకారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 11 ఏళ్ల చిన్నారి శ్రీజ బ్రెయిన్ ట్యూమర్ తో గత మూడు నెలల నుండి బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచింది. తండ్రి ప్రవీణ్ కుమార్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు వున్నారు. శ్రీజ లేని లోటు ఎవరు తీరుస్తారని తల్లితండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు.

Related posts