బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు
సిద్దిపేట జూన్ 06 (ప్రజాక్షేత్రం): ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను కలిసిన వారిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
