Praja Kshetram
తెలంగాణ

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి:టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి:టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్

 

 

షాద్ నగర్ జూన్ 11 (ప్రజాక్షేత్రం): మంగళవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని ప్రతం ఎడ్యుకేషనల్ కళాశాలలో షాద్ నగర్ టి ఎస్ ఎస్ ఓ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ సందర్భంగా లక్ష్మీ నివాస్ మాట్లాడుతూ సమాజంలో సమూల మార్పులు తీసుకువచ్చే శక్తి విద్యార్థులో ఉంటుందని అన్నారు. ప్రజలు యువత సామాజిక స్పృహను అలవార్పుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. చెట్లు లేకుంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, కాలుష్యం మానవ జీవన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలుష్యాన్ని తరిమికొట్టాలంటే ప్రతి ఇంటి ఆవరణలో, వ్యవసాయ పొలాలలో మొక్కలు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర నాయకులు సుదర్శన్ టి ఎస్ ఎస్ ఓ నాయకులు రాహుల్ శ్రీనివాస్, అఖిలేష్, వినయ్, వంశీ, అఖిలేష్, విజయ్, రమేష్, సతీష్, నితీష్ ,సుజిత్, హర్షవర్ధన్, రిషికేష్, సాయి, నరేష్, అజయ్, కుమార్, నాగరాజ్, రవితేజ, నర్సింహా, మహేందర్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Related posts