వైజాగ్ లో ఆర్ బి ఐ ప్రాంతీయ కార్యాలయం
విశాఖ పట్నం జూన్ 13 (ప్రజాక్షేత్రం):విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని వి ఎమ్ ఆర్ డి ఎ భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు భావిస్తున్నారు. ఆ భవనంలోని ఐదో అంతస్తును కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ను ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ కోరారు.కాగా ప్రతి రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
