సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?
హైదరాబాద్ జూన్ 20 (ప్రజాక్షేత్రం): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనఈరోజు రైల్లో మంటలు చెలరేగాయి. ఒకసారిగా రెండు ఏసీ బోగీ లో మంటలు చెలరే గినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటల ను అదుపు చేస్తున్నారు.ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో ఎవరూ లేకపో వడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా తీస్తున్నా రు. కాగా ఈ అగ్ని ప్రమాదా నికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.