Praja Kshetram
జాతీయం

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి..ఐపీఎస్ ఆఫీసర్ కల తీర్చిన అధికారులు

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి..ఐపీఎస్ ఆఫీసర్ కల తీర్చిన అధికారులు

 

వారణాసి,జూన్ 27(ప్రజాక్షేత్రం):ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్ళు నిండిపోతున్నాయి. తాజగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారి కి ఐ పి ఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మహామన క్యాన్సర్‌ ఆస్పత్రిలో బ్రెయిన్‌ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది. ఐ పి ఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఎ డి జి జోన్ వారణాసి వారి అధికారిక హ్యాండిల్‌లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామన క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐ పి ఎస్ అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారుల వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నేరవేరడంతో ఆ చిన్నారికి సంబందించిన ఫోటోలు నేట్టింట్లో షేర్ చేశారు. భారతి ఖాకీ దుస్తులు ధరించి ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీసు సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి.

Related posts