Praja Kshetram
తెలంగాణ

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్.

 

 

 

శంకర్ పల్లి జూన్ 28 (ప్రజాక్షేత్రం): మండలం,మోకీల తండాకు చెందిన సబావత్ దేవి శంకర్ ల కుమారుడు సబావత్ చందు ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్ జాతీయ స్థాయిలో 407 ర్యాంకు (ఎస్టి కేటగిరి) సాధించడం అభినందనీయమని మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ అన్నారు. తల్లిదండ్రుల సపోర్ట్, ఉపాధ్యాయుల,ప్రోత్సాహం,విద్యార్థుల పట్టుదల వారి ఉన్నత లక్ష్యాలను సాధించుటకు తోడ్పడుతుందని. తెలియజేశారు.జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన చందును ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల కొండకల్ తాండాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు,మరియు గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బాన్ని పురస్కరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ మాట్లాడుతూ… కూలి పని చేసే తల్లిదండ్రుల తనయుడు గిరిజన బిడ్డ జాతీయస్థాయి ర్యాంకు సాధించడం గర్వకారణమని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ… గత 9 సంవత్సరాల క్రితం మోకీల తాండకు చెందిన సబావత్ చందు,మరియు కొండకల్ తండాకు చెందిన రాథోడ్ శ్రీకాంత్ అనే ఇద్దరు విద్యార్థులను యూసుఫ్ గూడాలో గల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఐదవ తరగతిలో అడ్మిషన్ చేయాగా పదవ తరగతి వరకు ఇద్దరు విద్యార్థులు అక్కడే చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యారని,అనంతరం ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజీలో చదివిన చందు స్వయంకృషితో జేఈఈ అడ్వాన్స్ లో జాతీయస్థాయిలో 407 ర్యాంకు సాధించడం చాలా సంతోషకరమని,చందు గిరిజన ఆవాసంలో వికసించిన విద్యా కుసుమని,తాను చిన్నప్పటి నుండి చక్కటి క్రమశిక్షణ,వినయం విధేయత కలిగి, చదువుపట్ల శ్రద్ధతో ఉండేవాడని,తన యొక్క సద్గుణాలే తనను జాతీయస్థాయిలో ఉన్నత స్థానంలో నిలవడానికి తోడ్పడినాయని తెలియజేసి,చందు చదువు కోసం వారి తల్లిదండ్రులు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కిందని, భవిష్యత్తులో మరింత అంకితభావంతో తన లక్ష్యాన్ని చేరుటకు నిరంతర ప్రయత్నం కొనసాగించాలని,మధ్యలో వచ్చే ఆటంకాలను అధిగమిస్తూ,ఉన్నత స్థాయి ఉద్యోగాలైన ఐఏఎస్,ఐపీఎస్ లాంటి ఉద్యోగాన్ని సాధించి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు, మరియు ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చందును కోరి,శాలువా పూలమాలతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందు నాన్న శంకర్ నాయక్, కొండకల్ తాండ పాఠశాల విద్యార్థులు,గ్రామస్తులు రాథోడ్ మోహన్,రాథోడ్ లక్ష్మణ్,రాథోడ్ వసన్,నూన్సవత్ లోక్య, మూడవత్ శ్రీ జ్యోతి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts