జూలై 4న దేశవాప్త విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయండి
-పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు*l
చేవెళ్ళ జులై 02(ప్రజాక్షేత్రం): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 4 న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ప్రకటించడం జరిగింది. పిడిఎస్ యు, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, విజెఎస్, ఏఐవైఎఫ్, పివైఎల్, పివైసి, వైజెసి, దాదాపు 11 విద్యార్థి, యువజన,సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో భారత్ బంద్ నువిజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ కార్యదర్శి రాజేష్ లు మాట్లాడుతూ నీట్ మరియు నెట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈ బంద్ ను నిర్వహించడం జరుగుతుందని దానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలలో నెలకొన్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో కాస్మోటిక్ చార్జీలను పెంచాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. బిజెపి హయంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా నీటి పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ప్రైవేటు స్కూల్లో ఫీజులు దోపిడిని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు , ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు అశోక్, సిద్ధార్థ, బన్నీ ,హరీష్, అజయ్, వి. సిద్ధార్థ్, శివప్రసాద్ , హేమంత్, సాయి , అఖిల్ , నరసింహ తదితరులు పాల్గొన్నారు.