Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శైలజ ను సస్పెండ్ చేయాలి – పి డి ఎస్ యు

ఎస్సీ డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శైలజ ను సస్పెండ్ చేయాలి – పి డి ఎస్ యు

 

 

సూర్యాపేట జులై 04(ప్రజాక్షేత్రం): బాలేంలలోని అరవిందాక్ష కాలేజీ లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ విద్యార్థులకు మెనూ పాటించకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందించాలని అడిగిన విద్యార్థినిలను టార్గెట్ చేసుకోని వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకు పి డి ఎస్ యు విద్యార్థి సంగం మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ మాటలాడతూ విద్యార్థులు సరైన వసతులు లేవని ప్రిన్సిపాల్ ని అడిగితే మీకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తా అని బేధింపులకు గురిచేస్తుంది. తక్షణమే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం

ఆర్ సి ఓ అరుణ కుమారి జిల్లాలోని గురుకుల కళాశాల, పాఠశాలల ప్రిన్సిపాల్ తో కుమ్మక్కై విద్యార్థులు చనిపోతున్న, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా, ప్రిన్సిపాల్ లకు కొమ్ముగాస్తున్నది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రిన్సిపాల్ శైలజని సస్పెండ్ చేసి ఆర్ సి ఓ అరుణ కుమారి పై చర్యలు తీసుకొవాలి అని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సరైనది కాదు అని అన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కానీ విద్యార్థుల సమస్యలు మారడం లేదు. సరేనా సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణం మౌతుంది తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున, నాయకులు మందడి శ్రీధర్, బోల్క పవన్ పాల్గొన్నారు.

Related posts