Praja Kshetram
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ  -పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

-పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

-కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

 

భీంగల్ జులై 15(ప్రజాక్షేత్రం):భీంగల్ మండల కేంద్రంలోని బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన మండలానికి చెందిన 136 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలవి కానీ హామీలు ఇచ్చారు అని ఎమ్మెల్యే అన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదింటి ఆడబిడ్డ పెళ్లి కష్టం కాకూడదు అని కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాన్ని ప్రారంభించి గత పది ఏండ్లుగా పెళ్ళైన ఆడబిడ్డకు ఆర్థిక సహాయం చేసారని గుర్తు చేశారు.ఈ ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన లక్షకు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ చెక్కలు పొందిన లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ లబ్ధిదారులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts