రోడ్ల అభివృద్ధి చెందితేనే పరిశ్రమలు నెలకొల్పుతారు… రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
జడ్చర్ల,జూలై 15(ప్రజాక్షేత్రం):రాజా పూర్ మండల కేంద్రము లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగారెడ్డి గూడ నుండి రాజాపూర్ మండల కేంద్రానికి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చెందితేనే గ్రామాలలో ఉన్న భూములకు మంచి విలువ వస్తుందని, పరిశ్రమలు నెలకొల్పోవడంతో స్థానికంగా ఉండే వారికి ఉపాధి ఉంటుందని మంత్రి వెల్లడించారు అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి , ఎంపి, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డి కె అరుణ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి , మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి , ఎస్పీ డి జానకి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.