Praja Kshetram
క్రైమ్ న్యూస్

వరదలో కొట్టుకు పోయిన కారు – తండ్రి, కూతురు గల్లంతు.

వరదలో కొట్టుకు పోయిన కారు – తండ్రి, కూతురు గల్లంతు.

 

 

వరంగల్ సెప్టెంబర్ 01(ప్రజాక్షేత్రం): భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తుంది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి విధ్వంసం జరుగుతుంది. వరద నీటి ప్రవాహంతో వాగులు, కాలువలపై గల వంతెనలు, లో లెవెల్ కాజ్ వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. కేసముద్రం మండలంలోని ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రూట్లలో రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమయగూడెం శివారులోని ఆకేర్ వాగులో వరద నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు ఇద్దరూ గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా గేటు కారేపల్లి గంగారముకు చెందిన మోతిలాల్ ఆయన కూతురు అశ్విని కారులో హైదరాబాద్ బయలుదేరారు. అశ్విని సైంటిస్ట్. ఆమెతో కలిసి తండ్రి మోతిలాల్ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రయాణీకులతో కూడిన ఓ ఆర్టీసీ బస్సు వరద నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.

Related posts