Praja Kshetram
తెలంగాణ

ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం.. కాంగ్రెస్‌ సర్కారుపై కేటీఆర్‌ ఆగ్రహం

ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం.. కాంగ్రెస్‌ సర్కారుపై కేటీఆర్‌ ఆగ్రహం

 

హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం):కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆయన మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వారు.. కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు.. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని నిలదీశారు.సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారని ప్రశ్నించారు. ఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశిస్తారని.. మరో మీటింగ్‌లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడుతారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరం పై కమిషన్ లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలని నిలదీశారు. ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts