Praja Kshetram
తెలంగాణ

రూ. 45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బిల్ కలెక్టర్ మధు

రూ. 45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బిల్ కలెక్టర్ మధు

 

 

శంషాబాద్ ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బిల్ కలెక్టర్ అతని ప్రైవేట్ అసిస్టెంట్ పట్టుబడ్డ ఘటన రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని మైలార్దేవుపల్లి వార్డు కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న మధు, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రమేష్ తో కలిసి మైలార్దేవుపల్లి జిహెచ్ఎంసి వార్డు కార్యాలయంలో ఓ కంపెనీకి సంబంధించిన యజమాని వద్ద రూ.45,000 లంచం తీసుకుంటూ రెడ్ అండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాటేదాన్ పారిశ్రామిక అవార్డు లోని ఓ కంపెనీకి సంబంధించిన యజమాని వద్ద లంచం ఇవ్వకుంటే ప్రాపర్టీ టాక్స్ ఎక్కువ చేస్తామని బెదిరించి లక్ష రూపాయలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ మధు డిమాండ్ చేశాడు. తను అంత ఇచ్చుకోలేనని కంపెనీ యజమాని చెప్పి చివరకు రూ. 45 వేలకు బేరం కుదిరించుకొని, కంపెనీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తనను లంచం ఇవ్వమని జిహెచ్ఎంసి బిల్ కలెక్టర్ మధు అతని అసిస్టెంట్ రమేష్ వేధిస్తున్నారని చెప్పడంతో, ఏసీబీ డి.ఎస్.పి ఆనంద్ ఆధ్వర్యంలో బృందం ఇచ్చిన సూచన మేరకు సోమవారం మైలార్దేవుపల్లి జిహెచ్ఎంసి వార్డు కార్యాలయంలో కంపెనీ యజమాని బిల్ కలెక్టర్ మధు అతని ప్రైవేట్ అసిస్టెంట్ రమేష్ కు 45,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్ కలెక్టర్ మధు, ప్రైవేట్ అసిస్టెంట్ రమేష్ ఇద్దరినీ కేసు నమోదు చేసి బీసీపీ కోర్టుకు తరలించారు.

Related posts