సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్ ఆగస్టు 22(ప్రజాక్షేత్రం):సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహబూబ్నగర్కు చెందిన ఆయన 1998, 2004లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సిపిఐ )తరపున నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 12, 14వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. ఇతని తండ్రి పేరు వెంకట్రామిరెడ్డి.
పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం
నల్గొండ
వ్యక్తిగత వివరాలు
జననం
1942 మార్చి 25 (age 83)
కొండ్రావుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి: విజయలక్ష్మి
సంతానం:
ఇద్దరు కుమారులు
మతం
ఇండియన్ హిందూ
చదువు:
బి.ఏ ఉస్మానియా కళాశాల, కర్నూలు
ఎల్.ఎల్.బి ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల, హైదరాబాద్.
వివాహం:
1974 ఫిబ్రవరి 19 న విజయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు
