Praja Kshetram
తెలంగాణ

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు!

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు!

 

హైదరాబాద్ సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీల సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. ఈ నైపథ్యంలో జరగనున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని, బీసీలకు కులగణన సర్వే ద్వారా 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయాలని.. రిజర్వేషన్ల ఖరారు వివరాలను బయటికి వెల్లడించరాదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.

Related posts