స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
– జీవో నెంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్ అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):నేడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమీషన్ విడుదలకు బ్రేక్. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నేడు మరికొన్ని వాదనలు ఏజీ సింఘ్వీ వినిపించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని, నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. అయితే.. దీంతో మరికాసేపట్లో యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమీషన్ విడుదలకు బ్రేక్ పడింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై హైకోర్టు తీర్పు ఉత్కంఠ . వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ముగిసిన విచారణ .జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టేనాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ. తరువాత రిప్లైస్ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 2 వరాల సమయం ఇచ్చిన హై కోర్టు.
