వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు.
వారణాసి మే 14 (ప్రజాక్షేత్రం) : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోడీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు.