ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి
ఖమ్మం మే 18 (ప్రజాక్షేత్రం): ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేడు ఉదయం సదరు మహిళ కొణిజర్ల నుండి ఖమ్మం వెళ్ళి క్రమంలో బస్సు ఎక్కి ఫుట్ బోర్డు పై నిలబడి ఉండగా..కాలుజారి ఆమె ప్రయాణి స్తున్న బస్సు కింద పడి మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు లు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.